క్రీడలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం ప్రపంచం టెక్నాలజీ బిజినెస్ ఎంటర్టైన్‌మెంట్ హెల్త్‌ బంగారం వెండి రాశి ఫలాలు ట్రెండింగ్
తాజా వార్తలు
ఏపీలో పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలు.. ఎప్పుడంటే? ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త పెన్షన్ స్టేటస్, పేమెంట్ వివరాలు ఇలా చెక్ చేయండి చిన్న రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. అర్హతలు ఇవే మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల.. భారీగా పెరిగిన పోస్టులు SSC నుంచి వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు.. 6,155 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇంటి వద్దకే సేవలు.. ఎక్కడికి వెళ్లాల్సిన అక్కర్లేదు.. ఇంటిపై సోలార్ పెట్టుకుంటే డబ్బులే డబ్బులు! ఉచిత కరెంట్ బిల్లు, ప్రతి నెలా ఆదాయం! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారీ సబ్సిడీ. 10వ తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు కొత్త పెన్షన్ దరఖాస్తులు ప్రారంభం.. అర్హతలు, తేదీలు, పూర్తి ప్రక్రియ ఇదే గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. మొత్తం 13,706 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌!

ఏపీలో పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలు.. ఎప్పుడంటే? ప్రభుత్వం కీలక నిర్ణయం

WhatsApp Group Join Now

ఏపీలో పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలు.. ఎప్పుడంటే? | Ap Free House Sites Patta

ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన భూమిని గుర్తించి సేకరించే పనులపై అధికారులు దృష్టి పెట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును రెవెన్యూ శాఖ ప్రారంభించింది.

1,24,873 మందికి కొత్తగా ఇంటి స్థలాలు

ప్రస్తుతం కొత్తగా సుమారు 1,24,873 మంది అర్హులకు ఇంటి స్థలాలు అందించాల్సి ఉందని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వీరి కోసం దాదాపు 4,800 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు.

అవసరమైన భూమిని గుర్తించి సేకరించిన తర్వాత అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఇంటి స్థలం లేని పేదల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 4,59,050 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,43,496 మంది అర్హులుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1,88,561 దరఖాస్తులను అనర్హులుగా తేల్చారు.

NTR Bharosa Pension Status 2026
కొత్త పెన్షన్ స్టేటస్, పేమెంట్ వివరాలు ఇలా చెక్ చేయండి

ఇంకా 1,26,694 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటి పరిశీలన పూర్తయిన తర్వాత అర్హుల తుది జాబితాను సిద్ధం చేయనున్నారు.

పాత స్థలాల పరిస్థితిపైనా దృష్టి

గతంలో సెంటు స్థలం చొప్పున భూమిని కేటాయించినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు అక్కడ ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న లబ్ధిదారుల అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో సుమారు 2.50 లక్షల మంది ఇల్లులేని పేదలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు సుమారు 2.56 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఇళ్లను పొందేందుకు ఇప్పటివరకు 18,623 మంది ముందుకు వచ్చినట్లు సమాచారం.

మిగిలిన అర్హుల కోసం రాష్ట్రంలోని 3,304 గ్రామాల్లో భూసేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భూమి సేకరణకు సగటున ఎకరాకు రూ.37.5 లక్షల వరకు పరిహారం చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అక్టోబర్‌లో తుది జాబితా.. ఆ తర్వాత భూసేకరణ

అర్హుల తుది జాబితాను అక్టోబర్ నాటికి సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత నవంబర్ నుంచి అవసరమైన భూమి సేకరణ చేపట్టి, ప్రక్రియ పూర్తైన అనంతరం అర్హులకు ఇంటి పట్టాలు అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

Farmer Pension Scheme
చిన్న రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. అర్హతలు ఇవే

ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. పేదలకు ఇంటి స్థలాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన భూమిని సకాలంలో సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీంతో ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేదల్లో ఆశలు పెరిగాయి. అయితే తుది అర్హత, భూసేకరణ, పట్టాల పంపిణీ తేదీలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు నిర్ధారించుకోవాలి.

WhatsApp Group Join Now

Leave a Comment

WhatsApp